పశు వైద్యశాల కోసం స్థల పరిశీలన
### *పశు వైద్యశాల ఏర్పాటుకు ఏడీ పరిశీలన*
*AP VOICE TODAY*
*మాడుగుల రూరల్, జూలై 19:* మండలంలోని జాలంపల్లి, లోవపొన్నవోలు పంచాయతీల పరిధిలోని గల గ్రామాల్లో పశు వైద్యశాల ఏర్పాటుకు మాడుగుల ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు చిట్టినాయుడు పరిశీలన చేశారు.
ఆదివారం ఆయన ఆయా గ్రామాల్లోని పాడి రైతులను కలిశారు. తమ పంచాయతీలో పశు వైద్యశాల ఏర్పాటు చేయాలని ప్రజా వేదికలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామస్తులు, పాడి రైతులతో చర్చించారు.
పశువైద్యశాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని చిట్టినాయుడు తెలిపారు.
*గ్రామస్తులతో మాట్లాడుతున్న ఏడీ చిట్టినాయుడు*

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి