రోలుగుంట మహిళకు కోవిడ్.
ఏపీ వాయిస్ టుడే, రోలుగుంట
రోలుగుంట మహిళకు కరోనా పాజిటివ్.. కేజీహెచ్ పరీక్షల్లో నిర్ధారణ
హోం ఐసోలేషన్కు రిఫర్.. స్వల్ప లక్షణాలుండడంతో ఇంటికే పంపించారు
రోలుగుంట: మండల కేంద్రం రోలుగుంటకు చెందిన 58 ఏళ్ల మహిళకు కరోనా సోకింది.
స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి డా. శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం... రోలుగుంటలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ ఈ నెల 24వ తేదీన విశాఖపట్నంలో కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత జ్వరం, దగ్గు రావడంతో ఆమెను కేజీహెచ్కు తీసుకెళ్లారు.
కరోనా లక్షణాలు ఉండడంతో అక్కడే పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు విశాఖ డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ తెలిపారని స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి డా. శ్రావణి ఆదివారం చెప్పారు.
స్వల్ప లక్షణాలుండడంతో ఆమెకు మందులిచ్చి హోం ఐసోలేషన్లో ఉండాలని ఇంటికి పంపించారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, విశాఖలోనే వైద్య సేవలందిస్తున్నారని వైద్యాధికారి చెప్పారు.
ఈ నేపథ్యంలో రోలుగుంట మండలంలో అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పీహెచ్సీని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
- ఏపీ వాయిస్ టుడే రిపోర్టర్, రోలుగుంట

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి