ఏడీ సస్పెండ్
కఠిన చర్యలు
అనకాపల్లి మైనింగ్ AD సస్పెండ్
(అనకాపల్లి)
అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ఆరోపణలపై అనకాపల్లి జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పై ప్రభుత్వం వేటు వేసింది.
రాంబిల్లి మండలం పంచదార్ల రెవెన్యూ పరిధిలోని ఉమాధర్లింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో పరిమితికి మించి మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై విచారణ జరిపిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, మైనింగ్ చట్టాల అమలులో వైఫల్యం వంటి ఆరోపణలతో జిల్లా గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మజ్జి శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ శాఖ డైరెక్టర్ బాలచంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో ఆయన బాధ్యతలను అసిస్టెంట్ జియాలజిస్టుకు ఇన్-ఛార్జిగా అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఇకపై ఉక్కుపాదం మోపుతుందని అధికారులు హెచ్చరించారు.
AP VOICE TODAY
నిజమైన వార్త - మీ గొంతు

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి