అనకాపల్లి జిల్లా బిసీ సంక్షేమ శాఖ అధికారిణి శ్రీదేవి

 AP VOICE TODAY - అనకాపల్లి జిల్లా ఎడిషన్


ఏపీ వాయిస్ టుడే


తేదీ: జులై 31, 2025 | గురువారం



హాస్టల్ అవకతవలపై ఉక్కుపాదం


చీడికాడ BC బాలికల హాస్టల్ పై సంచలన విచారణ





చీడికాడ BC బాలికల హాస్టల్ లో కొంతకాలంగా కొనసాగుతున్న అవకతవలు, అక్రమాలపై జిల్లా BC సంక్షేమ శాఖ అధికారిణి కె.శ్రీదేవి స్వయంగా రంగంలోకి దిగి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.


బాలికలకు అమలు కాని మెనూ, సిబ్బంది దురుసు ప్రవర్తన, బాలికలతో బాత్ రూములు, మరుగుదొడ్లు కడిగించడం వంటి తీవ్రమైన ఫిర్యాదులు ఏప్రిల్ నెలలో అందాయి. జిల్లా స్పందనలో ఫిర్యాదుతోపాటు వీడియోకాల్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ సమస్య వెళ్లింది.


దీంతో వెంటనే స్పందించిన శ్రీదేవి గారు జాయింట్ కలెక్టర్, ఆర్ డి ఓ లతో కలిసి చీడికాడ హైస్కూల్ లోను, హాస్టల్ లోను రెండు దఫాలుగా సుదీర్ఘంగా విచారణ నిర్వహించారు.


విచారణలో వాస్తవాలు నిర్ధారణ కావడంతో ఈ విషయంలో వంట సిబ్బందిని వేరొక హాస్టల్ కు బదిలీ చేసి, అప్పటి వార్డెన్ ఎం.ఈ.ఓ ను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకున్నారు.

పేద బాలికలకు అండగా అధికారిణి శ్రీదేవి

పేద బాలికల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న జిల్లా BC సంక్షేమ శాఖ అధికారిణి కె.శ్రీదేవి గారు ఈ కేసులో ఎంతో బాధ్యతగా, నిబద్ధతతో వ్యవహరించారు. బాలికల సమస్యలను స్వయంగా తెలుసుకుని, ఎవరి ప్రమేయం లేకుండా నిష్పాక్షికంగా విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానికులు, బాలికల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి గారి చర్యను అందరూ అభినందిస్తున్నారు.


విచారణకు వచ్చిన అధికారుల బృందం

గురువారం సాయంత్రం 4 గంటలకు జిల్లా BC సంక్షేమ శాఖ అధికారిణి కె.శ్రీదేవి గారితోపాటు డ్వామా పి డి నిర్మలాదేవి, డి ఆర్ డి ఏ పి డి శశీదేవి, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా డి ఐ ఓ చంద్రశేఖర్, కె.కోటపాడు సి ఐ కిలపర్తి కృష్ణ, నోడల్ హెడ్మాస్టర్ డివరహమూర్తి, డి టి సింహాద్రి లు హాస్టల్ కు వచ్చారు.


ముందుగా బాలికలతో, అనంతరం వార్డెన్ లలిత, వంట సిబ్బందితో విడివిడిగా మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఈ విచారణ నివేదికను అనకాపల్లి ఆర్ డి ఓ ద్వారా కలెక్టర్ గారికి అందజేస్తామని అధికారిణి కె.శ్రీదేవి గారు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని హాస్టళ్లపై కఠిన నిఘా ఉంటుందని హెచ్చరించారు.


AP VOICE TODAY -

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.