ఇది కదా.. స్నేహం అంటే.

AP VOICE TODAY

Andhra Pradesh & Telangana Latest News

స్నేహమంటే ఇదేరా..!

ఒకే బ్యాచ్, ఒకే జాబ్ - 3గురు స్నేహితులకు TGSRTC డ్రైవర్ ఉద్యోగాలు

33 ఏళ్ల స్నేహానికి ప్రభుత్వ ఉద్యోగంతో పట్టాభిషేకం

తేదీ: 10-08-2026 | రిపోర్టర్: AP VOICE TODAY

08-07-1991. ఈ రోజున రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామంలో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకే బడిలో చేరిన వారు మిత్రులయ్యారు.

చదువయ్యాక డ్రైవింగ్ వృత్తిని ఎంచుకొని ఒకేచోట పనిచేసేవారు. ఇప్పుడు ఒకే నోటిఫికేషన్‌లో ముగ్గురూ సర్కారు కొలువు సాధించి స్నేహమంటే మాదే.. అని నిరూపించారు.

వారే నిదురం చెన్నయ్య యాదవ్, ఉప్పు శివకుమార్, శ్రీశైలం గౌడ్. డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్‌లోని భారత్ పెట్రోలియం సంస్థలో డ్రైవర్లుగా పనిచేస్తూ... ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. TGSRTC చేపట్టిన నియామకాలకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ముగ్గురూ డ్రైవర్లుగా ఎంపికవడంతో సంతోషంలో మునిగిపోయారు.

శివకుమార్, చెన్నయ్య, శ్రీశైలం గౌడ్

శివకుమార్, చెన్నయ్య, శ్రీశైలం గౌడ్

AP VOICE TODAY: ఇలాంటి స్ఫూర్తిదాయక వార్తల కోసం మా వెబ్సైట్ ను ఫాలో అవ్వండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే