చోడవరం లో స్వచ్చ పదం

AP VOICE TODAY

చోడవరం - స్వచ్ఛ పథం ప్రత్యేక వార్త

పంచాయతీ ఈఓ గంగాధర్ ఆధ్వర్యంలో చోడవరం పట్టణంలో స్వచ్ఛ పథం కార్యక్రమం - కోట దెబ్బలు ఏరియాలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

చోడవరం: పంచాయతీ ఈఓ గంగాధర్ గారి సమర్థ నాయకత్వంలో చోడవరం పట్టణంలో స్వచ్ఛ పథం అనే కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది.

ఈ కార్యక్రమం భాగంలో కోట దెబ్బలు అని ఏరియాలో శుభ్రతా కార్యక్రమం పెట్టడం జరిగింది.. అక్కడ కాలవలు లో ఇరువైపులను ఉన్న మొక్కలు తొలగించి, కాలవల లో ఉన్న సిల్ట్ బయటికి తీసి శుభ్రం చేయడమైనది.. తీసిన సిల్ట్ అంతా కూడా ట్రాక్టర్ ద్వారా దూరంగా తరలించడమైనది..

♻️ తడి చెత్త - పొడి చెత్త పై అవగాహన:
మరియు అక్కడున్న ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమం మీద అవగాహన కల్పించి స్పెషల్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడమైనది..

పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడమే లక్ష్యంగా ప్రతి బుధవారం ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేసి చోడవరం పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పథంలో ముందుకు తీసుకువెళ్తున్నాము....

పట్టణ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈఓ గంగాధర్ గారి కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.

🙏 🙏 🙏
AP VOICE TODAY | చోడవరం మున్సిపాలిటీ వార్తలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే