మోడరన్ కాలేజీ సత్తా

Modern Degree College Students

AP VOICE TODAY

ఫలితాలతో సత్తా చాటిన మోడరన్ డిగ్రీ కళాశాల

- విద్యార్థుల విజయాల వెనుక కరస్పాండెంట్ డా. లయన్ జి.వి.రావు కృషి అపూర్వం

రామచంద్రపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా:

విద్యార్థుల భవిష్యత్తుకే అంకితమైన ఒక విద్యా సంస్థకు నిజమైన సారథి ఎలా ఉంటారో మోడరన్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డా. లయన్ జి.వి.రావు నిరూపిస్తున్నారు.

బుధవారం విడుదలైన ఆదికవి నన్నయ యూనివర్సిటీ నాలుగవ సెమిస్టర్ డిగ్రీ ఫలితాల్లో లయన్ జి. వి. రావు మోడరన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కరస్పాండెంట్ డాక్టర్ లయన్ జి.వి.రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

విద్యార్థుల ప్రతిభకు కరస్పాండెంట్ మార్గదర్శకత్వమే కారణం

డా. జి.వి.రావు గారి దూరదృష్టి, క్రమశిక్షణ, విద్య పట్ల నిబద్ధత వల్లే ప్రతి సెమిస్టర్‌లో కళాశాల జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని అధ్యాపకులు, విద్యార్థులు కొనియాడుతున్నారు.

బీఎస్సీలో

  • టి. శాంతి స్వరూప - 9.6 GPA
  • సి.హెచ్. అలేఖ్య - 9.4 GPA
  • సి.హెచ్. శ్రీ లలిత - 9.2 GPA
  • కె. రామలక్ష్మి - 9.0 GPA

మొత్తం 14 మంది విద్యార్థులు ఈ కోర్స్ నందు 8.5 కంటే ఎక్కువ GPA సాధించినట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా బీఎస్సీ జువాలజీ నందు

  • పి. దివ్య - 9.4 GPA
  • జయ శ్రీ సత్య - 9.0 GPA
  • కె. చంద్రకళ - 9.0 GPA

బి.కామ్ నందు పి. తులసి జగదీశ్వరి - 8.6 GPA

బిసిఏ నందు యు.సాయి అనిత - 8.5 GPA సాధించినట్లు వెల్లడించారు.

అనంతరం ప్రిన్సిపల్ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పటిష్ట వార్షిక ప్రణాళిక, అత్యుత్తమ బోధన ద్వారా ప్రతి సెమిస్టర్ నందు తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.

విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్న నాయకత్వం

ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధినేత జి.వి.రావు, ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వర్లు, అకాడమిక్ డైరెక్టర్ కె.సాయిరాం చౌదరి, డిగ్రీ కళాశాల సిబ్బంది అభినందించారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్న డా. లయన్ జి.వి.రావు గారి సేవలు నిజంగా అభినందనీయం.


- నిజం చెపుతాం న్యూస్, రామచంద్రపురం జిల్లా బ్యూరో - ఆగష్టు 5

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే