ఏపీ లో కొత్త పెన్షన్లు.
ఆంధ్రప్రదేశ్లో నూతన పెన్షన్లు త్వరలో అందనున్నాయి
స్థలం: అమరావతి | సోర్స్: ఏపీ వాయిస్ టుడే
ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ఎదురుచూస్తున్న నూతన పెన్షన్లు త్వరలో అందనున్నాయి.
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా 50 ఏళ్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇతర హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం, నూతన పెన్షన్ల మంజూరుకు కూడా సిద్ధంగా ఉంది.
ప్రత్యేక సమాచారం: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ముందే నూతన పెన్షన్లను మంజూరు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారీ, ధృవీకరణ ప్రక్రియ చివరి దశలో ఉంది. అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో డేటాను క్రోడీకరిస్తున్నారు. అన్ని అర్హతలు కలిగిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నూతన పెన్షన్లను ప్రారంభించి, లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వేలాది మంది పేదలకు ఆర్థిక భరోసా లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై అర్హులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- ఏపీ వాయిస్ టుడే, అమరావతి

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి