పారిశుద్ధ్య కార్మికుడుకు. కారు.

AP VOICE TODAY
INSPIRING STORY

రూ.50 కూలీ నుండి ఫార్చ్యూనర్ వరకు
పారిశుధ్య కార్మికుడి అద్భుత ప్రయాణం!

📸 పారిశుధ్య కార్మికుడు శేషప్పన్న తన ఫార్చ్యూనర్ కారుతో విధులకు వస్తున్న దృశ్యం

పారిశుధ్య కార్మికుడు ఇలా విశాలవంతమైన కారులో వచ్చి పనిచేసి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

శేషప్పన్న 1996లో కేవలం 50 రూపాయల కూలి కోసం పౌరకార్మికుడిగా చేరాడు. కొంతకాలానికే పర్మినెంట్ ఉద్యోగి అయ్యాడు. మూడో తరగతి వరకే చదివిన శేషప్పన్న ఒకానొక దశలో మద్యానికి బానిసయ్యాడు.

2005లో బంట్వాళ్ ఎస్ఐ బెళ్ళియప్ప మాటల స్ఫూర్తితో మద్యం మానేశాడు. రోజూ మధ్యాహ్నం వరకూ పౌరకార్మికుడిగా పనిచేస్తాడు. ఆ తర్వాత పశువుల పెంపకం చూసుకుంటాడు. దీని ద్వారా నెలకు మరో రూ.40 వేలు సంపాదిస్తాడు.

ఈ క్రమంలో తొలుత ఆల్టో కారు కొన్న అతన్ని కొందరు 'పారిశుధ్య కార్మికుడికి కారు ఎందుకు..?' అని ఎగతాళి చేశారు. అయినా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు స్కార్పియో కొన్నాడు. పాత కారును విక్రయించి మళ్లీ లోన్ తీసుకుని కొత్త కారు కొనడం అలవాటుగా మారింది. ప్రస్తుతం ఫార్చ్యూనర్ కారు కొనుగోలు చేశాడు.

జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. మద్యానికి బానిసై ఎన్నో కోల్పోయాను. తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసేందుకు కూడా డబ్బులు లేవు. ఏ పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు. గౌరవమే ప్రధానం. ప్రస్తుతం పౌరకార్మికుడిగా వచ్చే జీతం కాకుండా పాడి పశువుల ద్వారా నెలకు మరో రూ.40వేలు సంపాదిస్తున్నాను. నాకిష్టమైన కారులో తిరగడం సంతోషంగా ఉంది

- పౌరకార్మికుడు శేషప్పన్న

✨ కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన శేషప్పన్న ✨
AP VOICE TODAY | స్ఫూర్తినిచ్చే కథనం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే