సుంకపూరు పంచాయతీ లో జోరుగా నూతన పెన్షన్లు అప్లికేషన్ల నమోదు.

పెన్షన్ల నమోదులో సుంకపురు సచివాలయం ముందంజ

కోట ఉరట్ల, ఏపీ వాయిస్ టుడే :

పెన్సన్స్ కొరకు అప్లికేషన్స్ నమోదు చేయడంలో కోట ఉరట్ల మండలం సుంకపూరు సచివాలయం సిబ్బంది ముందున్నారు.

పంచాయతీ అభివృద్ధి అధికారి మధుసూదనరావు ఆధ్వర్యంలో డిజిటల్ అసిస్టెంట్, సిబ్బంది నమోదు కార్యక్రమం జోరుగా సాగిస్తున్నారు. ఎంతో మంది వృద్ధులు, వితంతువులు నిరక్షరాస్యులు కావడంతో వారికి కావాల్సిన పత్రాల గురించి ఎంతో ఓపికగా వివరిస్తూ, ఆయా పత్రాలను స్వయంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు.

అర్హులైన అందరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తున్నామని పంచాయతీ అభివృద్ధి అధికారి మధుసూదనరావు అన్నారు.

పెన్షన్లు కోసం సచివాలయానికి వచ్చే వారిని చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ వారికి దగ్గరుండి అప్లికేషన్ నమోదు చేయిస్తున్న పంచాయతీ అభివృద్ధి అధికారి మధుసూదనరావును, డిజిటల్ అసిస్టెంట్ ను, సిబ్బందిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.

AP VOICE TODAY | KOTAURATLA

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే