నూతన త్రాగు నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేసిన ఈ ఓ గంగాధర్

ఏపీ వాయిస్ టుడే - చోడవరం

www.apvoicetoday.com | ప్రజల గొంతుక ప్రజల వార్త

చోడవరం పంచాయతీ ఈఓ గంగాధర్ చొరవతో యుద్ధప్రాతిపదికన తాగునీటి సమస్యకు పరిష్కారం - రూ.3 లక్షలతో 200 అడుగుల కొత్త జీఐ పైప్ లైన్

ఏపీ వాయిస్ టుడే, చోడవరం: ప్రజా సేవే పరమావధిగా పనిచేస్తున్న చోడవరం పంచాయతీ ఈఓ జి. గంగాధర్ మరోసారి తన చొరవను చాటుకున్నారు. గౌరీపట్నం నుంచి చోడవరానికి వచ్చే ప్రధాన తాగునీటి పైప్ లైన్ నర్సయ్య పేట వద్ద డ్యామేజ్ కావడంతో వేల లీటర్ల మంచినీరు వృధాగా పోతూ, మంచినీటి ట్యాంకులు నిండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

విషయాన్ని గ్రహించిన వెంటనే ఈఓ గంగాధర్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే గొప్ప మానవతా దృక్పథంతో, తక్షణమే సుమారు మూడు లక్షల రూపాయల విలువైన 200 అడుగుల, 8 అంగుళాల భారీ జీఐ పైపును హుటాహుటిన తెప్పించారు.

సోమవారం యుద్ధప్రాతిపదికన: సోమవారం ఉదయమే పాత డ్యామేజ్ అయిన పైప్ లైన్ ను తొలగించి, కొత్త జీఐ పైప్ లైన్ ను అమర్చడం జరిగింది. దీంతో తాగునీటి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడింది. గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించిన ఈఓ గంగాధర్ గారి పనితీరు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యల పట్ల అత్యంత అంకితభావంతో పనిచేసే అధికారిగా గంగాధర్ గారికి ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధికారులు ఉండడం చోడవరం ప్రజల అదృష్టమని స్థానికులు కొనియాడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే