నూతన త్రాగు నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేసిన ఈ ఓ గంగాధర్
ఏపీ వాయిస్ టుడే - చోడవరం
www.apvoicetoday.com | ప్రజల గొంతుక ప్రజల వార్త
చోడవరం పంచాయతీ ఈఓ గంగాధర్ చొరవతో యుద్ధప్రాతిపదికన తాగునీటి సమస్యకు పరిష్కారం - రూ.3 లక్షలతో 200 అడుగుల కొత్త జీఐ పైప్ లైన్
ఏపీ వాయిస్ టుడే, చోడవరం: ప్రజా సేవే పరమావధిగా పనిచేస్తున్న చోడవరం పంచాయతీ ఈఓ జి. గంగాధర్ మరోసారి తన చొరవను చాటుకున్నారు. గౌరీపట్నం నుంచి చోడవరానికి వచ్చే ప్రధాన తాగునీటి పైప్ లైన్ నర్సయ్య పేట వద్ద డ్యామేజ్ కావడంతో వేల లీటర్ల మంచినీరు వృధాగా పోతూ, మంచినీటి ట్యాంకులు నిండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.
విషయాన్ని గ్రహించిన వెంటనే ఈఓ గంగాధర్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే గొప్ప మానవతా దృక్పథంతో, తక్షణమే సుమారు మూడు లక్షల రూపాయల విలువైన 200 అడుగుల, 8 అంగుళాల భారీ జీఐ పైపును హుటాహుటిన తెప్పించారు.
సోమవారం యుద్ధప్రాతిపదికన: సోమవారం ఉదయమే పాత డ్యామేజ్ అయిన పైప్ లైన్ ను తొలగించి, కొత్త జీఐ పైప్ లైన్ ను అమర్చడం జరిగింది. దీంతో తాగునీటి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడింది. గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించిన ఈఓ గంగాధర్ గారి పనితీరు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యల పట్ల అత్యంత అంకితభావంతో పనిచేసే అధికారిగా గంగాధర్ గారికి ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధికారులు ఉండడం చోడవరం ప్రజల అదృష్టమని స్థానికులు కొనియాడుతున్నారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి